దేవునిమహిమ

(రోమా 3:23) ఏబేధమునులేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. దేవుని ముందు మానవులమైనమనమందరము పపము చేసి యున్నాము, పరిశుద్ధుని ముందు మనమంత పాపులము. పెద్దవారని చిన్నవారని గొప్పవారని పేదవారని ధనికులని, సంపన్నులని ఏబేధములేదు. అందరును పాపము చేసియున్నాము

ఆఙ్ఞాతిక్రమమే పాపము, చాలాసార్లు దేవుడిచ్చిన ఆఙ్ఞలు మితిమీరి, దేవునికి దూరస్తులమయ్యాము.

సృష్టికర్తయైన దేవునికి నీవు నేను దూరస్తులముగా పాపములో ఉండుట ఇష్టం లేక మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. (యోహాను 3:16) దేవుడు ఈలోక మానవులను ఎంతో ప్రేమించాడు, హద్దులు లేని ప్రేమచూపాడు, ఆగొప్ప ప్రేమకు నిదర్శనమే యేసుక్రీస్తు, పాపులమైన మనకొరకు కల్వరి సిలువలో తన్నుతాను బలిదానం చేసుకొన్నారు.

ప్రతివారు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆశించారు, నిత్యజీవం పొందాలంటే ప్రభువునందు విశ్వాసముంచి మన పాపములను ఆయన పాదముల ముందుంచి ఒప్పుకొని ప్రభువుని వెంబడించాలి. (మత్తయి 11:28) ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నాయొద్దకు రండి.

యేసుక్రీస్తు మనలను అనాధలుగా విడిచిపెట్టలేదు, ఈలోకమునకు వచ్చి మనకొరకు ప్రాణం పెట్టుటకు వెనుకాడలేదు, మనకొరకు ప్రాణం ఎవ్వరు పెట్టలేదు , ఒక్క లోకరక్షకుడని పేరుపొందిన యేసయ్య మాత్రమే మనకొరకు తన ప్రాణం అర్పించి తనరెండు చేతులను చాచి మనలను పిలుస్తున్నాడు .

ఈలోక శ్రమపాపంలో కొట్టుమిట్టాడుతున్న మానవులందరిని ప్రేమతో నావద్దకు రండి అంటున్నారు, మీరుసిద్దమేనా?

దేవుడిచ్చే మహిమను సొంతంసేసుకొందామా?

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *