మిమ్మును మీరు తగ్గించుకొనుడి
యాకోబు 4:10 “ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.”
యేసు ప్రభువు చేయని నేరములను తనపై మోపి, ఒక నిర్ధొషిని దోషిగా పిలాతు ఎదుట నిలువబెట్టినపుడు, యేసు ప్రభువు కోపాన్ని వ్యక్తపరిచడ, లేదా? నేను దొషిని కాను అని నిరూపించుకొనుటకు ప్రయత్నించడ? లేక శాంత స్వభావముగలవాడై, తన్ను తాను తగ్గించుకొనినవాడై పిలాతు అడిగినవాటికి సమాధానమిచ్చాడ? యేసు మాటలాడిన విధానమేమిటో ఆనాటి శిష్యులకును మనకును తెలుసు, కావున మనము కూడా అదే విధముగా సమాధానం ఇవ్వటం నేర్చుకోవాలి.
మన సంపదను, సమయమును బంధుత్వమును ఎవరైనా చెడగొట్టుటకు, లేదా దోచుకొనుటకు ప్రయత్నించినపుడు, మనం కూడా నెమ్మదితో నవ్వుతూ సమాధానం చెప్పగలిగితే, ప్రభువు మనకు నేర్పిన మార్గములో నడచిన వారమౌతాము. కోపం తెచ్చుకోకుండా, సహనం కలిగి ఉండగలిగితే, త్వరగా క్షమించే వారముగా ఉండగలము. అది దేవుడి కృప.
వినయము ఒక సద్గుణము, మరి ఇటువంటి వైఖరిని పాటించుట ఎందుకు కష్ఠంగా ఉంటుంది? ఎందుకంటే మనమంతా స్వార్థమైన మనస్తత్వముతో జన్మించాము,స్వార్తమైన మనసు వినయమునకు సహకరించదు, అసలు ఒప్పుకొనదు. అటువంటి సమయంలో మనం ఏమి చేయాలి? ప్రతి దినం ఈ స్వర్థమైన మనసు నుండి బయటకు వచ్చుటకు దేవుడి సహాయం అడగాలి. పరిసయ్యులు యేసు ప్రభుయొక్క వినయ మనసు అంగీకరించలేకపోయారు, ఎందుకంటే, యేసు యొక్క వినయమనసు వారి పాపపూరిత మైన జీవితమును బయటకు చూపించింది. కాబట్టి క్రైస్తవులమైన మనము, మన వినయ మనసును బట్టి, ఎప్పుడైన నిందిపబడినప్పుడు ఆశ్చర్య పడవలసిన పనిలేదు.
దేవుని ప్రజల వినయ విధేయతలు, ప్రపంచములోని అవిధేయతను బయటకు చూపుతుంది. కావున, క్రీస్తును అనుసరించేవారంతా వినయ, విధేయతలను చూపించినట్లైనా లోకములో దీపమును వెలిగించిన వారవుతారు. శ్రమల సమయములో మాత్రమే ఓపిక, సహనము కలిగియుండుట మాత్రమే కాదు, అన్ని వేళలలో వినయము కలిగి ఉండుట మన జీవితంలో భాగమై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక!